IND vs NZ: తొలిరోజు ఆటపూర్తి.. సెంచరీతో చెలరేగిన మయాంక్

IND vs NZ: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

Update: 2021-12-03 14:25 GMT

IND vs NZ: తొలిరోజు ఆటపూర్తి.. సెంచరీతో చెలరేగిన మయాంక్ 

IND vs NZ: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్‌ 80 పరుగుల అద్భుత భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో గిల్ సహా పుజారా, కోహ్లీ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వికెట్ కీపర్ సాహాతో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ క్రమంలో అగర్వాల్ శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజ్‌లో మయాంక్ అగర్వాల్ 120 పరుగులు, సాహా 25 పరుగులతో ఉన్నారు. ఇక న్యూజిలాండ్‌ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.

Tags:    

Similar News