బంగ్లాదేశ్తో తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారభంలోనే 15 పరుగుల వ్యవధిలో రెండు కీలక వికెట్లను భారత్ చేజార్చుకుంది. రెండో రోజు ప్రారంభమైన టెస్టులో 105 పరుగుల వద్ద చెతేశ్వర్ పుజారా( 54 పరుగులు 72 బంతుల్లో 9 ఫోర్లు) వికెట్ కోల్పోయింది. జాయేద్ బౌలింగ్లో సబ్ స్టిట్యూ ప్లేయర్ హసన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పరుగులులేమి చేయకుండానే వెనుదిరిగాడు. జాయేద్ బౌలింగ్ లో ఎల్బీడబ్యూ రూపంలో ఆవుటైయ్యాడు. ప్రస్తుతం జట్లు స్కారు 119-3 మయాంగ్ ఆగర్వాల్ 58 పరుగులతో కొనసాగుతున్నాడు.