భారత్ ఆసీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ తో తొలి వన్డే ముంబైలోని వాంఖేడేలో జరుగుతుంది. శిఖర్ ధావన్ ఆర్థ సెచంరీ చేశాడు. 66 బంతులు ఎదుర్కొన్న ధావన్ 8 ఫోర్లుతో ఆర్ధసెంచరీ సాధించాడు. వన్డే కెరీర్ లో ధావన్ కు 28వ హాఫ్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు . మరోవైపు రాహుల్(31) పరుగులతో రాణిస్తున్నాడు. వీరిద్దరు కలిసి 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక 50 పరుగులు భాగస్వామ్యం నమోదు చేసింది. మొదట టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆదిలో తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ (10) జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఔటైయ్యాడు. 4.3 ఓవర్ల వద్ద స్టార్క్ బౌలింగ్ లో వార్నార్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 20 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి భారత్ 100 పరుగులు చేసింది. రాహుల్ ,ధావన్ ఆసీస్ బౌలర్లపై ధాటిగా ఆడుతున్నారు.
FIFTY!
— BCCI (@BCCI) January 14, 2020
A hard-fought half-century for @SDhawan25 off 66 deliveries. This is his 28th in ODIs.#INDvAUS pic.twitter.com/6COdZJw5QP