అడిలైడ్‌ టెస్టులో భారత్‌ ఆటగాళ్లు ఘోర విఫలం

Update: 2020-12-19 06:02 GMT

అడిలైడ్‌ టెస్టులో భారత్‌ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదుచేసి చెత్త రికార్డు మూట గట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆసీస్ బౌలింగ్‌ ధాటికి ఇండియా ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 4 పరుగులకే కెప్టెన్‌ విరాట్ కోహ్లీ వెనుదిరిగాడు. పుజారా, రహానె, అశ్విన్‌ డకౌట్‌ అయ్యారు.  మరోవైపు తమ బౌలింగ్‌తో భారత్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు కమిన్స్‌, హెజిల్‌వుడ్‌.

Tags:    

Similar News