రెండో వన్డేలో న్యూజిలాండ్పై భారత్ ఘనవిజయం
IND vs NZ: టీమిండియా మరో సిరీస్ను కైవసం చేసుకుంది.
రెండో వన్డేలో న్యూజిలాండ్పై భారత్ ఘనవిజయం
IND vs NZ: టీమిండియా మరో సిరీస్ను కైవసం చేసుకుంది. రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా సిరీస్ను సాధించింది. 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20.1 ఓవర్లతో టార్గెట్ను చేధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. శుభ్మన్ గిల్ 40 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ 36 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో షమి 3, హార్దిక్ పాండ్య 2, వాషింగ్టన్ సుందర్ 2, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.