IND vs BAN 1st Test, Day 2: భోజన విరామ సమయానికి 188/3

Update: 2019-11-15 06:33 GMT
Mayank, Rahane guide INDIA

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు భోజన విరామం సమయానికి భారత్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్స్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ( 91 పరుగులు 166బంతుల్లో 13 ఫోర్లతో 1 సిక్స్ )తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఆటగాడు రహానే (37 పరుగులు 72 బంతుల్లో 6ఫోర్ల)తో రాణిస్తున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

ఓవర్ నైట్ స్కోరు 86/1తో రెండో రోజు బరిలోకి దిగిన భారత్ ఆట ప్రారభంలోనే 15 పరుగుల వ్యవధిలో రెండు కీలక వికెట్లను భారత్ చేజార్చుకుంది. రెండో రోజు ప్రారంభమైన టెస్టులో 105 పరుగుల వద్ద చెతేశ్వర్ పుజారా( 54 పరుగులు 72 బంతుల్లో 9 ఫోర్లు) వికెట్ కోల్పోయింది. జాయేద్ బౌలింగ్‌లో సబ్ స్టిట్యూ ప్లేయర్ హసన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పరుగులులేమి చేయకుండానే వెనుదిరిగాడు. జాయేద్ బౌలింగ్ లో ఎల్బీడబ్యూ రూపంలో 119-3 వికెట్లు కోల్పోయింది ఆవుటైయ్యాడు.

తొలి రోజు మొదటి ఇన్నింగ్స్ ఆట ముగిసే సమయానికి భారత్ 86/1(26 ఓవర్లు) పరుగులు చేసింది. మూడో సెషన్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. జట్టు 14 పరుగుల వద్ద రోహిత్ జాయద్ బౌలింగ్‌లో లిప్టన్ దాసుకు క్యాచ్ ఇచ్చి దొరికిపోయిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News