ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మెల్బోర్న్ వేదికగా జరుగుతోంది. టీంఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరోసారి ఫైనల్ చేరిన ఆసీస్ నాలుగుసార్లు చాంపియన్ గా నిలిచింది. భారత్ ఆడిన లీగ్ దశలో అంచనాలకు మించిన ఆటతీరు కనబరిచింది. అదే స్పూర్తితో భారత జట్టు ఫైనల్ కప్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. పోరాటంలో భారత జట్టు ప్రశంసలు పొందుతోంది. దీంతో మెల్బోర్న్లో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్యంఠ అందిరికి నెలకొంది.
జట్లు అంచనా భారత్ జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, తానియా, రాధా యాదవ్, పూనమ్,శిఖా పాండే, రాజేశ్వరి.
ఆసీస్ : మెగ్ లానింగ్ (సారథి), మూనీ, ఎలీసా హేలీ, హైన్స్, గార్డ్నర్, జెస్ జాన్సన్, దిలిస్సా, నికోలా, జార్జియా, సోఫియా/స్ట్రానో, మెగన్ షుట్.
Meg Lanning has won the toss and elected to bat at a rapidly filling MCG!
— T20 World Cup (@T20WorldCup) March 8, 2020
Good decision? 🤔#T20WorldCup | #FILLTHEMCG pic.twitter.com/o1Vq88PEcs