ICC T20 World Cup : ధాటిగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోనే భారీ స్కోరు

ఆసీస్ ఓపెనర్ అలిస్సా హీలి ఆర్థ శతకం నమోదు చేసుకుంది.

Update: 2020-03-08 07:39 GMT

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అలిసా హేలీ(50 పరుగులు, 30బంతుల్లో, 7 ఫోర్లు, రెండు సిక్సులు)తో ఆర్థ శతకం నమోదు చేసింది. మరో ఓపెనర్ మూనీ(29) దాటిగా ఆడుతున్నారు. ఆది నుంచే భారత బౌలర్లపై చెలరేగిపోతున్నారు.

టీ20ల్లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ హేలీ 2,000 పరుగులు పూర్తి చేసుకుంది. తొమ్మిది ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ కూడా నష్టపోకుండా ఆస్ట్రేలియా 76 పరుగులు చేసింది. లీగ్ మ్యాచ్‌ల్లో రాణించిన భారత బౌలర్లు ఫైనల్ మ్యాచ్ లో తేలిపోయారు. దీప్తి శర్మ రెండు ఓవర్లలోనే 23 పరుగులు ఇచ్చింది. శిఖాపండే రెండు ఓవర్లు బౌలింగ్ వేసిన 19 పరుగుల సమర్పించుకుంది.



Tags:    

Similar News