ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మెల్బోర్న్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అలిసా హేలీ(75 పరుగులు, 39 బంతుల్లో, 7 ఫోర్లు, 5 సిక్సులు)తో టీమిండియా బౌలర్లపై చెలరేగిపోయింది. ఈనేపధ్యంలో 30 బంతుల్లో ఆర్థ శతకం నమోదు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ ఆది నుంచే భారత బౌలర్లపై చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో టీ20ల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ హేలీ 2,000 పరుగులు పూర్తి చేసుకుంది.
ఇక 12 ఓవర్ బాల్ అందుకున్న రాధా యాదవ్, అలిసా హేలీ పెవిలియన్ చేర్చింది. యాదవ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి వేదా కృష్ణమూర్తి చేతికి దొరికిపోయింది. 13 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి ఆస్ట్రేలియా 123 పరుగులు చేసింది. లీగ్ మ్యాచ్ల్లో రాణించిన భారత బౌలర్లు ఫైనల్ మ్యాచ్ లో తేలిపోయారు. మరో ఓపెనర్ మూనీ(40, 34 బంతుల్లో, 5 ఫోర్లు) దాటిగా ఆడుతున్నారు మరో వైపు కెప్టెన్ మెగ్ లానింగ్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Healy goes for 75, the highest score in a Women's #T20WorldCup final.
— T20 World Cup (@T20WorldCup) March 8, 2020
BIG wicket for India. #T20WorldCup | #FILLTHEMCG
SCORE 📝 https://t.co/fEHpcnTek4 pic.twitter.com/jHUTsCHPJm