మళ్లీ నిరాశ పరిచిన పీవీ సింధు

Update: 2019-11-15 01:44 GMT
P. V. Sindhu

హాంకాంగ్‌లో జరిగిన ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌-500వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత జట్టు క్రీడాకారులు నిరాశపరిచారు. ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు టోర్నమెంట్‌లో రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్లో థాయ్‌లాండ్ కు చెందిన బుసానన్‌ ఒంగ్‌బామ్రుంగ్‌ఫాన్‌ చేతిలో సింధు 18–21, 21–11, 16–21తో ఓటమి చెందింది.

పురుషుల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ కిడాంబి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. భారత సహచరుడు సౌరభ్‌ వర్మ జరిగిన పోరులో 21–11, 15–21, 21–19తో శ్రీకాంత్‌ విజయం సాధించాడు. రెండో సీడ్‌లో చౌతియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) 12–21, 23–21, 21–10 వరుస సెట్లలో భారత క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌పై అతికష్టం మీద నెగ్గాడు. డుబుల్స్ రౌండ్‌లో సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప జోడి 19–21, 12–21తో యుత వతనబె–అరిస హిగషినొ జంట చేతిలో ఓడిపోయారు. 

Tags:    

Similar News