లావణ్య త్రిపాఠికి షాక్.. నివాసంలో జీఎస్టీ అధికారుల సోదాలు
టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి ఇంట్లో Gst అధికారులు సోదాలు నిర్వహించారు.
టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి ఇంట్లో Gst అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని లావణ్య త్రిపాఠి ఇంట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. డీజీజీఐ అధికారులు దాడులు విషయం తెలుసుకున్న లావణ్య త్రిపాఠి సినిమా షూటింగ్ను రద్దు చేసుకుని నివాసనికిచేరుకున్నారు.
టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి నివాసంతో పాటు మొత్తం 23 ప్రాంతాల్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చిట్ఫండ్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, కన్స్ట్రక్షన్ కంపెనీలతో పాటుగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీల్లో డీజీజీఐ సోదాలు నిర్వహిస్తు్న్నారు. కొన్ని కోట్ల రూపాయల్లో ట్యాక్స్ ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతోనే దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా, లావణ్య త్రిపాఠి ఇంటిపై సోదాలు నిర్వహించడం ఇదే మొదటి సారి.
డీజీజీఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సమయంలో లావణ్య త్రిపాఠి A1 ఎక్స్ప్రెస్ చిత్రంలో బిజీగా ఉన్నారు. సోదాలు విషయం తెలియడంలో ఆమె హుటాహుటిన ఇంటికి చేరుకున్నారని తెలుస్తోంది. A1 ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్నారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి క్రీడాకారినిగా కనిపించనున్నట్లు సమాచారం. నిఖిల్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన అర్జున్ సురవరం చిత్రం విజయం నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.