4th Test: మార్చి 4 నుంచి మొతేరాలో తుది టెస్టు ప్రారంభం

4th Test: మెతేరా స్టేడియంలో ఇంగ్లాండ్​తో జరగనున్న 4వ టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు.

Update: 2021-03-01 15:43 GMT

రోహిత్ శర్మ (ఫోటో ఇన్‌స్టాగ్రామ్)

4th Test: మెతేరా స్టేడియంలో ఇంగ్లాండ్​తో జరగనున్న నాలుగో టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది బీసీసీఐ. ఇంగ్లాండ్​తో సిరీస్​లో చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత ప్లేయర్లు సన్నద్ధమవుతున్నారంటూ ట్వీట్‌ను ట్యాగ్ ​ చేసింది. మార్చి 4 నుంచి మొతేరా వేదికగా తుది టెస్టు ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్​లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న కోహ్లీ సేన.. చివరి మ్యాచ్​ను గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఇదిలావుంటే నాలుగో టెస్టుపై ఓ ట్వీట్ చేశాడు హిట్​మ్యాన్ రోహిత్ శర్మ. అంతే కాదు మెతేరా పిచ్ నాలుగో టెస్ట్‌కు ఎలా ఉండనుందో కూడా చెప్పుకొచ్చాడు. మూడో టెస్టుకు ముందు వికెట్​ స్పిన్​కు సహకరిస్తుందంటూ చెప్పిన రోహిత్​ తాజాగా గ్రౌండ్‌లో పడుకున్నట్లు ఉన్న ఫోటో పోస్ట్ చేశాడు. నాల్గవ టెస్టు కోసం తయారైన పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తుందని చెప్పకనే చెప్పాడు.


Tags:    

Similar News