India vs England: 81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్

Update: 2021-02-25 13:41 GMT

81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్

మొతేరాలో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ తడబడింది. భారత బౌలర్ల ధాటికి 81 పరుగులకే కుప్పకూలింది. అక్షర్ పటేల్‌, అశ్విన్‌లు మరోసారి చెలరేగడంతో ఇంగ్లిష్ ఆటగాళ్లు త్వరత్వరగా పెవిలియన్‌ చేరారు. ఈ క్రమంలో అశ్విన్‌ మరోమైలు రాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు క్రియేట్‌ చేశాడు. టెస్టులో 400 వికెట్ల మైలురాయిని కూడా చేరుకున్నాడు.

Tags:    

Similar News