WPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్

WPL 2024: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్

Update: 2024-03-17 03:45 GMT

WPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్

WPL 2024: వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి ఏడున్నర గంటలకు తుది పోరు ప్రారంభంకానుంది. ఇరు జట్లూ తొలిసారి టైటిల్‌ను గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. అయితే ఆర్సీబీ ఫైనల్ ఇదే మొదటిసారి కాగా.. అటు ఢిల్లీ ఫైనల్ చేరడం ఇది రెండోసారి. దీంతో ఫైనల్‌లో ఎవరు విజయం సాధించినా చరిత్ర సృష్టించనున్నారు.

Tags:    

Similar News