నైట్‌రైడర్స్ ఆశలపై నీళ్లు

Update: 2020-10-30 05:21 GMT

ప్లే ఆఫ్స్ చేరేందుకు ఒకే అడుగు దూరంలో ఉన్న కోల్‌కతాకు.. ఆ ఆశలను దూరం చేసింది చెన్నై. నామమాత్రపు మ్యాచ్‌లో చెలరేగి ఆడింది. లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడిన చెన్నై కోల్‌కతా విధించిన టార్గెట్‌ను 6 వికెట్ల తేడాతో పూర్తి చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. నితీష్ రానా మాత్రమే 81 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇక ఆ తర్వాత టార్గెట్ చేజింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్ ఝుళిపించాడు. అయితే చివర్లో రెండు బంతులకు 7 రన్స్ చేయాల్సి రావటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ సమయంలో జడేజా రెండు సిక్సర్లు బాదటంతో దీంతో చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

Tags:    

Similar News