ఆసీస్ కి బుమ్రా షాక్!

అడిలైట్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కి వరుసగా రెండు షాక్ లు ఇచ్చాడు భారత ఫేస్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా.. ఆస్ట్రేలియా ఓపెనర్లు మాథ్యూ వేడ్‌ (8), జో బర్న్స్‌ (8)ను పెవిలియన్‌కు చేర్చాడు.

Update: 2020-12-18 07:30 GMT

అడిలైట్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కి వరుసగా రెండు షాక్ లు ఇచ్చాడు భారత ఫేస్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా.. ఆస్ట్రేలియా ఓపెనర్లు మాథ్యూ వేడ్‌ (8), జో బర్న్స్‌ (8)ను పెవిలియన్‌కు చేర్చాడు. 14వ ఓవర్‌లో వేడ్‌ను, 16వ ఓవర్‌లో బర్న్స్‌ను ఔట్ చేసి ఆ జట్టుకు షాక్ ఇచ్చాడు బుమ్రా. దీనితో ఆసీస్ తోలి సెషన్‌ ముగిసేసరికి 19 ఓవర్లకు గాను రెండు కీలకమైన వికెట్లని కోల్పోయి 35 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో లబుషేన్‌, స్టీవ్ స్మిత్‌‌ (1) ఉన్నారు. ఇక భారత్ కంటే ఆస్ట్రేలియా 209 పరుగుల వెనుకంజలో ఉంది. అటు భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 244 పరుగులకి ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట మొదలు పెట్టిన టీం ఇండియా మరో 11 పరుగులు అదనంగా చేసి మిగిలన నాలుగు వికెట్లను చేయిజార్చుకుంది. 

Tags:    

Similar News