ఉత్కంఠ భరిత పోరులో బెంగాల్ వారియర్స్ గెలుపు
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్పై విజయం నమోదు చేసుకొని జోరు కొనసాగిస్తోంది.
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్పై విజయం నమోదు చేసుకొని జోరు కొనసాగిస్తోంది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో చివరి వరకూ ఉఠ్కంట భరితంగా సాగిన మ్యాచ్లో పోరాడిన బెంగాల్ వారియర్స్ 41-40 పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.బెంగాల్ వారియర్స్ని ఫామ్లో ఉన్న స్టార్ రైడర్ మణీందర్ అదే ఆట తీరును కొనసాగిస్తూ జైపూర్పైనా సత్తాచాటాడు. మ్యాచ్లో మణీందర్ ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. 24 సార్లు రైడ్కి వెళ్లిన 19 పాయంట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మరోవైపు జైపూర్ జట్టులోనూ సీనియర్ రైడర్ నీలేశ్ సాలుంకే జట్టుని గెలిపించేందుకు విశ్వప్రయత్నించాడు. కానీ.. ఆఖర్లో చేసిన చిన్న తప్పిదం ఆ జట్టుకి విజయాన్ని చేజార్చింది. మ్యాచ్లో 17 సార్లు రైడ్కి వెళ్లిన నీలేశ్ ఏకంగా 15 పాయింట్లని టీమ్కి అందించాడు. దీంతో.. జైపూర్ టీమ్కి సొంతగడ్డపై వరుసగా రెండో మ్యాచ్లోనూ నిరాశ తప్పలేదు. శనివారం రాత్రి గుజరాత్తో జరిగిన మ్యాచ్ని జైపూర్ టైగా ముగించిన విషయం తెలిసిందే.