వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు జట్టు ఎంపిక

Cricket: వెస్టిండీస్‌తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Update: 2022-01-27 00:30 GMT

వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు జట్టు ఎంపిక

Cricket: వెస్టిండీస్‌తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్, డి.చాహర్, శార్దూల్ ఠాకూర్, వై చాహల్, కుల్దీప్ యాదవ్, డబ్ల్యూ సుందర్, రవి బిష్నోయ్, ఎండీ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణా, అవేశ్ ఖాన్‌లను జట్టుకు ఎంపిక చేశారు.

మరోవైపు.. టీ 20లకు కూడా బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, వై చాహల్, కుల్దీప్ యాదవ్, డబ్ల్యూ సుందర్, రవి బిష్నోయ్, ఎండీ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ క్రిష్ణా, అవేశ్ ఖాన్‌, హర్షల్ పటేల్‌లను జట్టుకు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్, 16 నుంచి టీ20 సిరీస్ జరగనుంది. 

Tags:    

Similar News