T20 Series: బంగ్లాదేశ్ పై చేజేతులా ఓడిన భారత్!
టీమిండియా చేజేతులా ఓటమిని తెచ్చుకుంది. ఇప్పటి వరకూ ఒక్క టీ20 మ్యాచ్ లోనూ బంగ్లాదేశ్ జట్టుపై ఓటమి చూడని భారత్ బంగ్లా జట్టు ముందు అనూహ్యంగా ఓడిపోయింది.
టీమిండియా చేజేతులా ఓటమిని తెచ్చుకుంది. ఇప్పటి వరకూ ఒక్క టీ20 మ్యాచ్ లోనూ బంగ్లాదేశ్ జట్టుపై ఓటమి చూడని భారత్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లా జట్టు ముందు అనూహ్యంగా ఓడిపోయింది. భారత్ పై తోలి టీ 20 గెలిచి బంగ్లాదేశ్ రికార్డు సృష్టించింది.
ముష్ఫికర్ రహీమ్ (60 నాటౌట్: 43 బంతుల్లో) అద్భుత అర్ధశతకం బాదడంతో టీమిండియా నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే చేదించి విజయం సాధించింది. టీ20 చరిత్రలో టీమిండియాపై బంగ్లాదేశ్ గెలుపొందడం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలోకీ దూసుకుపోయింది. ఇక రెండో టీ20 మ్యాచ్ రాజ్కోట్ లో గురువారం రాత్రి జరుగుతుంది.
ఆ రెండు జీవన దానాలే కొంపముంచాయి!
బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ముష్ఫికర్ రహీమ్ చేదనలో బంగ్లాదేశ్ ను విజయతీరాలకు చేర్చాడు. అయితే, భారత జట్ట్టు ఆటనికిచ్చిన అవకాశాలే టీమిండియా కొంపముంచాయి. 18 వ వోవర్లో ముష్పికర్ ఇచ్చిన క్యాచ్ ని చేతుల్లోకి అందినా కృనాల్ పాండ్య వదిలేశాడు. ఆ తరువాతి ఓవర్లో ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో వరుసగా నాలుగు బౌండరీలు బాదాడు ముష్ఫికర్. మ్యాచ్ మధ్య ఓవర్లలోనూ ముష్ఫికర్ ఎల్బీడబ్ల్యూగా ఔటవగా.. రిషబ్ పంత్ నుంచి సపోర్ట్ లభించకపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్ఎస్ కోరలేదు. దీంతో రెండు సార్లు బతికిపోయిన ముష్ఫికర్ ఆఖరి వరకూ క్రీజులో నిలిచి బంగ్లాదేశ్ని 19.3 ఓవర్లలో 154/3తో గెలిపించాడు. భారత జట్టు చేసిన తప్పిదాలే బంగ్లాదేశ్ కు వారాలుగా మారాయి.
మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (41) తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (9) తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాది ఔటైపోయాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (15) బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమై వికెట్ చేజార్చుకోగా.. శ్రేయాస్ అయ్యర్ (22) సిక్స్ కొట్టే ప్రయత్నంలో ఔటైపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (27) 19వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచినాపరుగులు రాబట్టడం లో విఫలం అయ్యాడు. అయితే, చివరి రెండు ఓవర్లలో కృనాల్ పాండ్య (15 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (14 నాటౌట్) భారీ షాట్లు ఆడటంతో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగలిగింది.
That's that from Delhi. Bangladesh win the 1st T20I by 7 wickets and go 1-0 up in the 3-match series.#INDvBAN pic.twitter.com/z2ezFlifYx
— BCCI (@BCCI) November 3, 2019