బంతి దెబ్బకు.. అంపైర్ మృతి!
క్రికెట్ బాల్ తలకు గట్టిగా తాకడంతో నెలరోజుల నుంచి ఆసుపత్రిలో ఉన్న ఓ అంపైర్ మృతి చెందిన సంఘటన గురువారం ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది.
క్రికెట్ బాల్ తలకు గట్టిగా తాకడంతో నెలరోజుల నుంచి ఆసుపత్రిలో ఉన్న ఓ అంపైర్ మృతి చెందిన సంఘటన గురువారం ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో భాగంగా జులై 13న పెమ్బ్రోక్షైర్ X నార్బెత్ జట్ల మధ్య కౌంటీ క్రికెట్ జరిగింది. ఆ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన జాన్ విలియమ్స్(80) తలకు బంతి తగలడంతో తీవ్ర గాయమైంది.
ఆయనను వెంటనే ఆసుపత్రికి చేర్చారు. బంతి బలంగా తాకడంతో ఆ అంపైర్ కోమాలోకి వెళ్ళిపోయారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హావర్ఫోర్డ్వెస్ట్లోని మరో ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పెమ్బ్రోక్షైర్ క్రికెట్ క్లబ్ గురువారం ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపింది. 'అంపైర్ జాన్ విలియమ్స్ గురించి చేదు వార్త వినాల్సివచ్చింది. ఈ ఉదయం ఆయన ఆస్పత్రిలో మృతిచెందారు. పెమ్బ్రోక్షైర్ క్రికెట్ తరఫున సంతాపం తెలుపుతున్నాం' అంటూ ట్వీట్ చేసింది.
So very sad to hear the news today about John Williams. Rest in peace.
— CC Hendygwyn (@CCHendygwyn) August 15, 2019
Our thoughts are with all the family and his many friends at this time. https://t.co/9AYi8WG8Yk