కోహ్లీ చేతికి గాయం
వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ కుడిచేతి బొటనవేలికి గాయమైంది.
వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ కుడిచేతి బొటనవేలికి గాయమైంది. ఫాస్ట్ బౌలర్ కీమర్ రోచ్ విసిరిన బౌన్సర్ని ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. అయితే, వేగంగా వచ్చిన బంతి అతని కుడిచేతి బొటనవేలిని బలంగా తాకడంతో నొప్పితో భారత కెప్టెన్ విలవిలలాడిపోయాడు. కోహ్లీ పరిస్థితిని గమనించిన టీమిండియా ఫిజియో మైదానంలోకి వచ్చి.. ప్రథమ చికిత్సతో కెప్టెన్కి నొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించాడు.
ఆ నొప్పిని భరిస్తూనే తన ఆటను కొనసాగించాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి (114 నాటౌట్: 99 బంతుల్లో 14x4) అజేయ శతకంతో భారత్ జట్టుని గెలిపించాడు. కాగా, ఈనెల 22 నుంచి వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభకానున్న నేపథ్యంలో కోహ్లీ గాయంపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
బొటన వేలి గాయంపై తాజాగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'గాయం అంత తీవ్రంగా ఏమీ లేదు. ఒకవేళ బొటన వేలి ఎముకకి ఏదైనా గాయమై ఉండింటే..? బ్యాటింగ్ కొనసాగించేవాడ్ని కాదు' అని వెల్లడించాడు.