వెస్టిండీస్పై అఫ్గానిస్తాన్ సంచలన విజయం
టీ20 సిరీస్లో అఫ్గానిస్తాన్ జట్టు సంచలనం సృష్టించింది. విండీస్తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను అఫ్గానిస్తాన్ 2–1తో కేవసం చేసుకుంది.
టీ20 సిరీస్లో అఫ్గానిస్తాన్ జట్టు సంచలనం సృష్టించింది. విండీస్తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను అఫ్గానిస్తాన్ 2–1తో కేవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో అఫ్గాన్ 29 పరుగుల తేడాతో వెస్టిండీస్పై సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 159 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఛేదనలో 20 ఓవర్లు ఆడి 7 వికెట్లు కల్పోయి 127 పరుగులకే పరిమితమైంది. వెస్టిండీస్ బ్యాట్స్మెన్స్లో షై హోప్ 46 బంతుల్లో 52పరుగులు 3 ఫోర్లు, 1సిక్స్ ఉన్నాయి. విండీస్ నుంచి హోప్ పోరాటం చేసిన ఇతర బ్యాట్స్ మెన్స్ నుంచి సహకారం లభించలేదు. అఫ్గాన్ బౌలర్ నవీన్ హుల్ హక్ 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టు ఓపెనర్ రెహ్మనుల్లా 52 బంతుల్లో 79 పరుగులు ఆరు ఫోర్లు 5 సిక్సులతో విండీస్ బౌలర్లపై చెలరేగిపోయాడు. అస్గార్ అఫ్గాన్ 24 పరుగలుతో రాణిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో విలియమ్స్, కార్టెల్, పాల్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. కెప్టెన్ పొలార్డ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. వన్డే సిరిస్లో వెస్టిండీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే