Ind vs SA First Test Updates : లంచ్ విరామ సమయానికి భారత్ స్కోరు 90/0
విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ భోజన విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది.
విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ భోజన విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(52)ఐదు ఫోర్లు ,రెండు సిక్స్ లతో హాఫ్ సెంచరీతో అజేయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో ఓపెనర్ మయాంక్ ఆగర్వాల్ (39) ఆరు ఫోర్లు ఒక సిక్సర్ తో నాటౌట్ గా ఉన్నాడు. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టన్ కోహ్లీ నమ్మకాన్ని నిలబెడుతూ ఓపెనర్లు ఇద్దరూ రాణిస్తున్నారు.