టీటీడీ బోర్డు సభ్యురాలిగా ప్రముఖ ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి సుధా నారాయణమూర్తి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. సుధా నారాయణమూర్తి తో ఘంటా మండపంలో ప్రమాణం చేయించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ప్రమాణస్వీకారం అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వాచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసి, జ్ఞాపికను అందజేసిన చైర్మన్ సుబ్బారెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి. రెండవసారి టీటీడీ ట్రస్ట్ బోర్డులో అవకాశం దొరికిన సుధానారాయణమూర్తి.. పుట్టా సుధాకర్ యాదవ్ చైర్మన్ గా ఉన్న సమయంలో సభ్యురాలిగా వ్యవహరించారు.