Garuda Puranam: మరణం సమీపిస్తోందని తెలిపే 5 సంకేతాలు.. గరుడ పురాణం ఏం చెబుతోంది? ఆఖరి క్షణాల్లో ఆత్మకు ఏం కనిపిస్తుంది?
Signs Before Death in Garuda Puranam: మరణానికి ముందు కనిపించే సంకేతాలు ఏమిటి? గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చివరి క్షణాలు ఎలా ఉంటాయి? నీడ అదృశ్యం నుండి యమదూతల దర్శనం వరకు గరుడ పురాణం చెప్పే రహస్యాలు ఇక్కడ తెలుసుకోండి.
Garuda Puranam: మరణం సమీపిస్తోందని తెలిపే 5 సంకేతాలు.. గరుడ పురాణం ఏం చెబుతోంది? ఆఖరి క్షణాల్లో ఆత్మకు ఏం కనిపిస్తుంది?
Signs Before Death in Garuda Puranam: హిందూ మతంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి ఆత్మ ప్రయాణం, మరణం మరియు కర్మఫలాల గురించి వివరించిన గ్రంథమిది. గరుడ పురాణం ప్రకారం, మరణం అనేది అకస్మాత్తుగా సంభవించేది కాదు. ఒక వ్యక్తి ప్రాణాలు విడిచే ముందు ప్రకృతి మరియు శరీరం కొన్ని రహస్య సంకేతాలను ఇస్తాయని ఈ పురాణం చెబుతోంది.
గరుడ పురాణం పేర్కొన్న ముఖ్యమైన సంకేతాలు:
1. నీడ కనిపించకపోవడం: సాధారణంగా కాంతి ఉన్నప్పుడు నీడ కనిపిస్తుంది. కానీ, మరణం సమీపించిన వ్యక్తికి తన సొంత నీడ కనిపించదని, ఒకవేళ కనిపించినా అది వికృతంగా లేదా తల లేనిదిగా కనిపిస్తుందని గరుడ పురాణం చెబుతోంది. ఇది జీవితపు అంతానికి ప్రాథమిక సంకేతం.
2. పూర్వీకులు కలల్లోకి రావడం: చనిపోయిన బంధువులు లేదా పూర్వీకులు పదే పదే కలల్లో కనిపిస్తుంటే అది మరణ సూచనగా భావిస్తారు. వారు నవ్వుతూ పిలవడం లేదా తమతో రమ్మని సైగ చేయడం వంటివి ఆత్మ ప్రయాణానికి సమయం దగ్గరపడిందని సూచిస్తాయి.
3. యమదూతల దర్శనం: మరణానికి కొన్ని గంటల ముందు లేదా క్షణాల ముందు, సదరు వ్యక్తికి యమదూతలు కనిపిస్తారని గరుడ పురాణం చెబుతోంది. చుట్టూ ఉన్న వారికి వారు కనిపించరు కానీ, బాధితుడికి మాత్రం భయంకరమైన ఆకారాలు కనిపించి భీతికి గురవుతారని, ఆ సమయంలో వారు మాట పడిపోయి వింతగా ప్రవర్తిస్తారని వివరించబడింది.
4. జీవిత చిత్రం కళ్ల ముందు మెదలడం: గరుడ పురాణం ప్రకారం, ప్రాణాలు పోయే ముందు వ్యక్తి చేసిన మంచి, చెడు కర్మలన్నీ ఒక సినిమా రీలులా కళ్ల ముందు కనిపిస్తాయి. తన జీవితంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందే చివరి అవకాశం ఇదేనని నమ్ముతారు.
5. శరీరంలో మార్పులు: మరణం దగ్గరపడే కొద్దీ అరచేతిలోని రేఖలు మసకబారడం, ముక్కు వంకరగా మారడం లేదా నాలుక వాపు రావడం వంటి శారీరక మార్పులు కనిపిస్తాయని గరుడ పురాణంలో పేర్కొన్నారు.
మరణానంతరం గరుడ పురాణ పారాయణం ఎందుకు?
ఒక వ్యక్తి మరణించిన తర్వాత 13 రోజుల పాటు ఇంట్లో గరుడ పురాణాన్ని చదివిస్తారు. దీని వెనుక ప్రధాన ఉద్దేశ్యం.. మరణించిన ఆత్మ తన ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులను తెలుసుకుని శాంతి పొందుతుందని, అలాగే కుటుంబ సభ్యులకు మరణం పట్ల భయం పోయి వైరాగ్యం కలుగుతుందని నమ్మకం.
గమనిక: పైన పేర్కొన్న విషయాలు కేవలం గరుడ పురాణంలోని మతపరమైన విశ్వాసాల ఆధారంగా సేకరించినవి. వీటిని శాస్త్రీయంగా ధృవీకరించలేదు.