తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

ఏడుకొండలవాడి‌ క్షేత్రంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Update: 2019-11-02 04:27 GMT

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

తిరుమలలో గడిచిన వారంరోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.... ఇవాళ శనివారం, స్వామివారికి నిత్యసేవలు మినహా ప్రత్యేకసేవలుండవు..రద్దీ దృష్ట్యా సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 10 గంటల సమయం, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు స్వామివారిని దర్శించుకోవటానికి 4 గంటల సమయం పడుతొంది...

నిన్నటి రోజు శుక్రవారం 67,243 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, భక్తులు సమర్పించిన కానుకలతో రూ 3.86 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది, 29,786 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.

Tags:    

Similar News