గుండెపోటుతో స్టేడియంలోనే కుప్పకూలిన అంపైర్...
మ్యాచ్ జరుగుతుండగా గుండెపోటులో అంపైర్ మృతి చెందిన ఘటన పాకిస్థాన్ లోని కరాచీలో చోటుచేసుకుంది.
మ్యాచ్ జరుగుతుండగా గుండెపోటులో అంపైర్ మృతి చెందిన ఘటన పాకిస్థాన్ లోని కరాచీలో చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం. ఓ క్లబ్ ఈవెంట్ సందర్భంగా నిర్వహిస్తున్న మ్యాచ్ కు నసీమ్ షేక్ అంపైర్ గా వ్యవహరించాడు. మ్యాచ్ మధ్యలో ఒక్కసారిగా అతడు కుప్పకూలాడు దీంతో వెంటనే అతన్ని అంబులెన్స్ ద్వారా దగ్గరలోని అస్పత్రికి తరించారు. మార్గమధ్యలోనే నసీమ్ మరణించాడని నిర్వాహకులు తెలిపారు. గతంలోనే అతడికి అంజియోగ్రామ్ సర్జరీ జరిగిందని తెలుస్తోంది. కాగా నసీమ్ క్రికెట్పై ఉన్న మమకారంతో అపైర్ గా మారాడు. అంపైర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.