దిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకొనేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వాధినేతలు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. లాక్డౌన్ అమలును ఉల్లంఘించే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని రాష్ట్రాలకు సూచించింది.