Congress: లోక్సభ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసిన ఏఐసీసీ
Congress: 57 మంది పేర్లతో థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసిన ఏఐసీసీ
Congress: లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 57 మంది పేర్లతో థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసింది ఏఐసీసీ. తెలంగాణ నుంచి మరో 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి టికెట్ కేటాయించారు. సీనియర్ల మధ్య పోటీతో ఇన్నాళ్లూ సస్పెన్స్లో ఉన్న నాగర్కర్నూల్ స్థానంలో కూడా అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. నాగర్ కర్నూల్ నుంచి మాజీ ఎంపీ మల్లురవి బరిలోకి దిగుతున్నారు. సంపత్కుమార్ నుంచి అభ్యర్థిత్వానికి తీవ్ర పోటీ నెలకొన్నా హైకమాండ్ మల్లు రవివైపే మొగ్గుచూపింది.
ఇక ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ముగ్గురు నేతలకు టికెట్లు దక్కాయి. మల్కాజ్గిరి స్థానంలో బండ్ల గణేష్, మైనంపల్లి హన్మంత్రావు పేర్లు వినిపించాయి. నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ను కూడా పోటీ చేయమని కాంగ్రెస్ అడిగినట్టు ప్రచారం జరిగింది. అయితే అధిష్టానం అనూహ్యంగా ఇటీవల పార్టీలో చేరిన సునీతా మహేందర్రెడ్డిని మల్కాజ్గిరి నుంచి బరిలోకి దించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్రెడ్డి బరిలోకి దిగనున్నారు. తొలిజాబితాలో తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థుల్ని, మూడో జాబితాలో ఐదుగురు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్ మరో 8 స్థానాలను పెండింగ్లో ఉంచింది.