Mallikarjun Kharge: కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు

Mallikarjun Kharge: ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 11 శాతమే నిధులు వచ్చాయి

Update: 2024-03-21 08:16 GMT

Mallikarjun Kharge: కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు

Mallikarjun Kharge: కాంగ్రెస్‌కు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లు 11 శాతమేనన్నారు ఎఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమయం చూసి కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని బీజేపీ అగ్రనేతలు చూస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని, అధికారం కొందరి చేతుల్లో కేంద్రీకృతమవడమనేది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన విషయమని ఖర్గే తెలియజేశారు. కాంగ్రెస్ అకౌంట్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని ఖర్గే ధ్వజమెత్తారు.

Tags:    

Similar News