Narendra Modi: 2023లో దేశం ఎన్నో ఘనతలు సాధించింది

Narendra Modi: మారడంపై ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తం చేశారన్న మోడీ

Update: 2023-12-31 13:24 GMT

Narendra Modi: 2023లో దేశం ఎన్నో ఘనతలు సాధించింది

Narendra Modi: 2023లో దేశం ఎన్నో ఘనతలు సాధించిందని మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఆమోదం పొందిందని ఆయన గుర్తు చేశారు. జీ20 విజయవంతం, భారత్‌ ఐదో ఆర్థిక వ్యవస్థగా మారడంపై ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. నాటునాటు పాటకు ఆస్కార్ వరించిందని, వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు అందరి మనసులు దోచిందని మోడీ తెలిపారు. దేశ ప్రజలు వికసిత్‌, ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తిని 2024లోనూ ఇదే స్పూర్తిని కొనసాగించాలని మోడీ ఆకాంక్షించారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన స్పందన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News