Patna: ఈడీ విచారణకు హాజరైన తేజస్వి యాదవ్

Patna: లాలూ ఇంటికి భారీగా తరలివచ్చిన ఆర్జేడీ కార్యకర్తలు

Update: 2024-01-30 06:28 GMT

Patna: ఈడీ విచారణకు హాజరైన తేజస్వి యాదవ్

Patna: బిహార్ రాజధాని పాట్నాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈడీ విచారణతో ఆర్జేడీ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈడీ ఆఫీస్‌తో పాటు, మాజీ సీఎం లాలూ నివాసం దగ్గరకు కార్యకర్తలు భారీగా చేరుకుని.. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

జాబ్ ఫర్ స్కా్మ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. నిన్న ఇదే కేసులో తండ్రి లాలూ ప్రసాద్‌ను ఈడీ పదిగంటల పాటు విచారించగా.. ఇవాళ తేజస్వీయాదవ్‌ విచారణకు హాజరయ్యారు. దీంతో ఈడీ కార్యాలయానికి తరలివచ్చిన ఆర్జేడీ కార్యకర్తలు..ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News