రైల్వేస్టేషన్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్లక్ష్య వైఖరి.. వైద్యశాఖ అధికారిపై సస్పెన్షన్ వేటు

Update: 2020-03-21 09:24 GMT

కర్ణాటకలోని తుముకూర్ రైల్వే‌స్టేషన్‌లో థర్మల్ స్క్రీనింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యశాఖ సీనియర్ హెల్త్ అసిస్టెంట్ నరసింహమూర్తిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రైలు దిగిన ప్రయాణికులని అత్యంత జాగ్రత్తగా థర్మల్ స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ వైద్యాధికారి నరసింహమూర్తి మాత్రం కుర్చీలో కూర్చుని నిర్లక్ష్యంగా థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ వీడియోకి చిక్కారు. మధ్యలో ఫోన్ మాట్లాడుతూ నామమాత్రంగా థర్మల్ స్క్రీనింగ్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సదరు సీనియర్ హెల్త్ అసిస్టెంట్ నరసింహ మూర్తిని సస్పెండ్ చేశారు.


Tags:    

Similar News