మరోసారి ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధి

Update: 2020-02-03 04:18 GMT

తేలికపాటి జ్వరం, కడుపులో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నందున కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని తనిఖీ కోసం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు ఆసుపత్రిలో కొన్ని సాధారణ పరీక్షలు చేశారు. ఒకటి లేదా రెండు రోజుల్లో సోనియాగాంధీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. శనివారం పార్లమెంటులో జరిగిన కేంద్ర బడ్జెట్ ప్రదర్శనకు అస్వస్థత కారణంగానే ఆమె హాజరుకాలేదు. కొన్నేళ్లుగా సోనియా గాంధీ ఆరోగ్యం కాంగ్రెస్ కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తుంది. ఆమెకు కొంతకాల్నగా తీవ్రమైన ఉబ్బసంతో బాధపడుతున్నారు.

ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకోవడానికి తరచుగా యునైటెడ్ స్టేట్స్కు వెళుతుంటారు. ఏదైనా ఇతర సమస్యలు ఉంటే, ఆమె సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళుతుంటారు. కాగా సోనియా గాంధీ ఆరోగ్యం కుదుటపడాలని కాంగ్రెస్ కార్యకర్తలు గుళ్ళలో పూజలు చేస్తున్నారు. సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత మినహా ఏమి లేదని కాంగ్రెస్ వెల్లడించడంతో ఆమె అభిమానులు కుదుటపడ్డారు. ఇవాళ రాహుల్, ప్రియాంక లు సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళ్లనున్నారని తెలిసింది.  

Tags:    

Similar News