Rajasthan Political Crisis: అందుకే అశోక్ గెహ్లాట్ ను వ్యతిరేకిస్తున్నాం : సచిన్ వర్గ ఎమ్మెల్యేలు

Rajasthan Political Crisis: రాజస్థాన్‌లో రాజకీయ పోరాటం కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు.

Update: 2020-07-16 08:44 GMT
rajasthan political crisis,

Rajasthan Political Crisis: రాజస్థాన్‌లో రాజకీయ పోరాటం కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. అయితే వారు హైకోర్టుకు వెళతారా లేక సుప్రీంకోర్టుకు వెళతారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ సిపి జోషి సచిన్ పైలట్ సహా 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు, జూలై 17 లోగా సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.

ఇదిలావుండగా, బుధవారం అర్థరాత్రి పైలట్ క్యాంప్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మురారీ లాల్, రమేష్ మీనా తమ మీద ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన హార్స్ ట్రేడింగ్, అవినీతి ఆరోపణలను తోసిపుచ్చారు. మా పోరాటం ఆత్మగౌరవం కోసమేనని.. డబ్బుల కోసం కాదని అన్నారు. గెహ్లాట్ పని పట్ల తమకు సంతృప్తి లేనందువల్లే పైలట్ కు మద్దతు తెలుపుతున్నామని వారన్నారు. భవిషత్ లో కూడా పైలట్ వెంటే ఉంటామని.. తమపై ఎటువంటి చర్యలు తీసుకున్నా సరేనన్నారు. అయితే సచిన్ పై చర్యలు తీసుకునే ముందు కాంగ్రెస్ పార్టీ తన భవితవ్యం గురించి ఆలోచించుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు.

కాగా శాసనసభ్యులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పార్టీ శాసనసభ పార్టీ సమావేశానికి హాజరుకాలేదని చీఫ్ విప్ మహేష్ జోషి.. అసెంబ్లీ సచివాలయంలో ఫిర్యాదు చేశారు. వారికి పార్టీ విప్ జారీ చేసింది. దీంతో యాంటీ డిఫెక్షన్ లా (డిఫెక్షన్ లా) వారికి వర్తిస్తుందని.. దీని కింద ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే నిబంధన ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు సచిన్ పైలట్, రమేష్ మీనా, విశ్వేంద్రసింహ్, డిపెండ్రాసింగ్, భన్వర్లాల్ శర్మ, హేమరం చౌదరి, ముఖేష్ భాకర్, హరీష్ మీనాతో సహా 19 మంది ఎమ్మెల్యేలకు బుధవారం మధ్యాహ్నం స్పీకర్ నోటీసులు పంపారు.

Tags:    

Similar News