Congress: రేపు రాష్ట్రపతిని కలవనున్న కాంగ్రెస్ సభ్యులు

Congress: లఖీంపూర్ ఘటనపై నివేదిక ఇవ్వనున్న రాహుల్ టీమ్

Update: 2021-10-12 14:14 GMT

రేపు రాంనాథ్ కోవింద్ ను కలువనున్న రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధి (ఫైల్ ఇమేజ్)

Congress: లఖీంపూర్ హింసాత్మక ఘటనపై కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు రేపు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ టీమ్ రాష్ట్రపతిని కలిసి లఖింపుర్‌ ఘటనపై వాస్తవాలతో కూడిన నివేదికను అందజేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, సీనియర్‌ నేతలు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌, అధిర్‌ రంజన్‌ చౌధరీ, కేసీ వేణుగోపాల్‌ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. రేపు 11.30 గంటలకు రాష్ట్రపతిని కలవనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఇదే సమయంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌ను రాష్ట్రపతి ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News