PM Modi: నేటి నుంచి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

PM Modi: యూపీలోని మీరట్ నుంచి ప్రచారం ప్రారంభం

Update: 2024-03-31 02:26 GMT

PM Modi: నేటి నుంచి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

PM Modi: మూడోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల సమాయత్తం అవుతోంది. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది ఎన్డీయే కూటమి. అందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి రేపటి నుంచి ప్రధాని మోడీ శంఖారావం పూరించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మోడీ ప్రారంభించనున్నారు. రామాయణ్ సీరియల్ నటుడు అరుణ్ గోవిల్‌ను బీజేపీ ఇక్కడి నుంచి పోటీకి దింపింది.

అరుణ్ గోవిల్‌తో పాటు ఆర్ఎల్డీ అధ్యక్షులు జయంత్ చౌదరి ప్రధానమంత్రితో వేదికను పంచుకోనున్నారు. రామమందిర నిర్మాణం, యూపీ మాజీ సీఎం చౌదరి చరణ్ సింగ్‌కు భారత రత్న, ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీ ప్రస్తావించనున్నారు.

Tags:    

Similar News