Padma Awards Ceremony: రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Padma Awards Ceremony: 2021 ఏడాదికి 119 మంది పద్మా అవార్డులకు ఎంపిక

Update: 2021-11-09 09:17 GMT

పద్మ భూషణ్ అవార్డు తీసుకున్న సుమిత్ర మహాజన్

Padma Awards Ceremony: కేంద్ర ప్రభుత్వం 2021 ఏడాదికి గానూ పద్మ అవార్డులకు ఎంపిక చేసిన వారికి పురస్కారాలను ప్రదానం చేసింది. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ భూషణ్‌ అవార్డును అందుకున్నారు. పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికైన అస్సాం దివంగత మాజీ సీఎం తరుణ్ గొగోయ్‌ తరఫున ఆయన భార్య డాలీ గొగోయ్.. కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తరఫున ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ అవార్డులను స్వీకరించారు. అలాగే ప్రముఖ శిల్పి సుదర్శన్ సాహూకు రాష్ట్రపతి పద్మ భూషణ్‌ పురస్కారాన్ని అందజేశారు. 

Tags:    

Similar News