President Kovind: మార్చి 30న రాష్ట్రపతి కి బైపాస్ సర్జరీ

President Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌కు బైపాస్‌ చేయనున్నారు.

Update: 2021-03-27 16:03 GMT

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌ (ఫొటో ట్విట్టర్)

President Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌కు బైపాస్‌ చేయనున్నారు. ఛాతీ నొప్పితో నిన్న ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు రాష్ట్రపతి. వైద్యపరీక్షల అనంతరం బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు ఎయిమ్స్‌లో ఈ నెల 30న బైపాస్‌ సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు డాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం కోవింద్‌ను ఆర్మీ ఆసుపత్రిలో పరామర్శించారు. రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నేతలు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రధాని మోదీ కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుమారుడితో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నట్లు పీఎంఓ ట్వీట్ చేసింది.

Tags:    

Similar News