Droupadi Murmu: అయోధ్యను తొలిసారిగా సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ

Droupadi Murmu: రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్

Update: 2024-05-02 03:50 GMT

Droupadi Murmu: అయోధ్యను తొలిసారిగా సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా అయోధ్యలో సందర్శించారు. అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడిని దర్శించుకున్న రాష్ట్రపతి.. రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమాంలో అయధ్య ఎయిర్ పోర్టు చేరుకున్న ద్రౌపది ముర్మూకు.. ఉత్తరప్రదేశ్ గవర్నర్ అనందీబెన్ పటేల్.. యూపీ మంత్రి సూర్య ప్రతాప్ షాహీ ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయానికి వెళ్లారు. హనుమంతునికి స్వయంగా హారతి ఇచ్చారు. అక్కడి నుంచి అయోధ్య రామ మందిరం చేరుకున్నారు. బాలరాముడిని దర్శించుకుని.. రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సరయూనది ఘాట్ లో సూర్య మహాహారతి కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు.

Tags:    

Similar News