Narendra Modi: మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అందుకున్న ప్రధాని మోడీ

Narendra Modi: లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం అవార్డు

Update: 2022-04-24 16:00 GMT

మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అందుకున్న ప్రధాని మోడీ

Narendra Modi: ప్రధాని మోడీ మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అందుకున్నారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని ముంబయిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మోడీకి ప్రదానం చేశారు. ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మోడీ. కరోనా వేళ పూణేలోని మంగేష్కర్ ఆసుపత్రి ఎన్నో సేవలు అందించిందని కితాబిచ్చారు. యోగా, ఆయుర్వేదంలో మనదేశం ప్రపంచానికి దిక్సూచి అని పేర్కొన్నారు. మనదేశ మూలాల్లోనే పర్యావరణ పరిరక్షణ సూత్రాలు ఇమిడి ఉన్నాయని వివరించారు. 

Tags:    

Similar News