యూపీలో మాస్కులకు పార్టీ గుర్తులు

ఎన్నికల నేపథ్యంలో పార్టీల గుర్తులతో మాస్కుల తయారీ

Update: 2022-02-01 04:17 GMT

యూపీలో మాస్కులకు పార్టీ గుర్తులు

UP Election 2022: యూపీలో ఎన్నికల సందడి మాస్కుల వరకు చేరింది. ఇప్పుడు మాస్కులు కూడా పార్టీల గుర్తులతో వచ్చేశాయి. ఆయా పార్టీల గుర్తులతో రూపొందించిన మాస్కులు మార్కెట్లలో సందడి చేస్తున్నాయి. పార్టీల గుర్తులున్న మాస్కులపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. తమ అభిమాన పార్టీ గుర్తున్న మాస్కులను కొనుగోలు చేస్తున్నారు.

యూపీలోని వ్యాపారులు ట్రెండ్‌ను అనుకూలంగా మలుచుకుంటున్నారు. కరోనా మహహ్మారి విజృంభించడంతో మాస్కులకు గిరాకీ ఏర్పడింది. ఆ మాస్కులు వివిధ రంగుల్లో, కంపెనీల గుర్తులతో ఇప్పటివరకు వచ్చాయి. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మాస్కులు పార్టీల రంగులను సంతరించుకున్నాయి.

కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం.. పలువురు ప్రచారానికి వెళ్తుండడం గమనించిన వ్యాపారులు పార్టీల రంగులు, గుర్తులతో మాస్కులను తయారు చేస్తున్నారు. యూపీలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ గుర్తులతో మాస్కులను రూపొందించారు.

వాటిని కొనుగోలు చేయడానికి ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. వాటిని ధరించి.. తమ పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఈ మాస్కులకు మంచి గిరాకీ ఉన్నట్టు అటు వ్యాపారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News