పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై అధికారిక ప్రకటన

* ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు తొలివిడత సమావేశాలు * మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు * జనవరి 29న ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి కోవింద్‌ ప్రసంగం

Update: 2021-01-14 13:13 GMT

parliament (file image) 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ సారి సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగనుండగా మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. జనవరి 29న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు.

Tags:    

Similar News