Bihar: నేడు బిహార్ అసెంబ్లీలో నితీష్కుమార్ సర్కార్కు బలపరీక్ష
Bihar: ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు శ్రమిస్తున్న పార్టీలు
Bihar: ఎన్డిఎతో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు. గత నెలలో, విపక్షాల ఇండియా కూటమిని వదిలిపెట్టి NDA- BJP కూటమిలో తిరిగి చేరారాయన. ఆ తర్వాత రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే తన సొంత పార్టీ జనతాదళ్-యునైటెడ్ ఎమ్మెల్యేలందరికీ ఫ్లోర్ టెస్ట్ కు హాజరు కావాలని విప్ జారీ చేశారు.
ఈ నేపథ్యంలోనే బలపరీక్షకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. బలపరీక్ష జరుగనున్న నేపథ్యంలో బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్లో క్యాంపు ఏర్పాటు చేశారు. దాదాపు వారం రోజులుగా బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉంటున్నారు. బలపరీక్ష నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాట్నా వెళ్లనున్నారు.