ఢిల్లీలో ఆసక్తికర పరిణామం.. కాంగ్రెస్ అధినేత రాహుల్ తో బీహార్ సీఎం నితీష్ భేటీ..

Nitish Kumar: దేశ రాజధాని ఢిల్లీలో ఆకస్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2022-09-05 15:09 GMT

ఢిల్లీలో ఆసక్తికర పరిణామం.. కాంగ్రెస్ అధినేత రాహుల్ తో బీహార్ సీఎం నితీష్ భేటీ..

Nitish Kumar: దేశ రాజధాని ఢిల్లీలో ఆకస్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిశారు. ఈసందర్భంగా ఇద్దరు ప్రస్తుత రాజకీయాలతోపాటు.. దేశంలో పరిస్థితి మరియు ప్రతిపక్ష ఐక్యతను నిర్ధారించే మార్గాలు, ఇతర కీలకాంశాలపై ప్రధానంగా చర్చించారు. ఇటీవల బీజేపీ నుంచి బయటకొచ్చి బలనిరూపన చేసుకున్న నితీష్ తాజాగా విపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా తన పార్టీ ముఖ్యనేత జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్, రాష్ట్ర మంత్రులు సంజయ్ తోకలిసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిశారు. యాంటీ బీజేపీ దిశగా వాయిస్ పెరుగుతున్న నేపథ్యంలో నితీష్ రాహుల్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News