నేడు కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం
Delhi: 11 మందితో ప్రమాణస్వీకారం చేయించనున్న రాజ్యసభ చైర్మన్
కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు నేడు పదవీ ప్రమాణం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ తరపున గొల్ల బాబురావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్నికైన కొత్త సభ్యులతో ఇవాళ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మొత్తం 11 మంది సభ్యులతో రాజ్యసభ ఛైర్మన్ ప్రమాణస్వీకారం చేయిస్తారు.