Tamil Nadu: ఎన్నికల షెడ్యూల్ వచ్చాక తొలిసారి తమిళనాడుకు ప్రధాని మోడీ
Tamil Nadu: కోయంబత్తూరులో మోడీ రోడ్ షో
TamilNadu: కేంద్రంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న ప్రధాని మోడీ..సుడిగాలి పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. తమిళనాడు పర్యటనలో భాగంగా..కోయంబత్తూరు రోడ్ షోలో పాల్గొన్నారు ప్రధాని మోడీ. దాదాపు 3.6 కిలోమీటర్ల మేర జరిగిన రోడ్ షోలో.. బీజేపీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారాయన. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి మోడీ..మోడీ అంటూ నినాదాలు చేశారు.