ప్రధాని మోడీకి మమతాబెనర్జీ షాక్‌

Cyclone Yaas: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల అంకం ముగిసినా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మధ్య మాత్రం ఇంకా పోరు కొనసాగుతూనే ఉంది.

Update: 2021-05-28 10:26 GMT

ప్రధాని మోడీకి మమతాబెనర్జీ షాక్‌

Cyclone Yaas: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల అంకం ముగిసినా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మధ్య మాత్రం ఇంకా పోరు కొనసాగుతూనే ఉంది. హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి బెంగాల్‌ పీఠాన్ని అధిష్టించిన మమతా బెనర్జీ కేంద్రంతో నువ్వానేనా అన్నట్టే ముందుకెళ్తున్నారు. ప్రధాని మోడీతో సై అంటే సై అంటూ ఢీకొడుతున్నారు. తాజాగా బెంగాల్‌లో వరదల బీభత్సాన్ని సమీక్షించడానికి వచ్చిన ప్రధాని మోడీకి దీదీ షాకిచ్చారు. ఏరియల్‌ సర్వేకు ముందు ప్రధాని మోడీ నిర్వహించిన సమీక్షా సమావేశాన్ని మమతాబెనర్జీ బహిష్కరించారు.

Tags:    

Similar News