మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడిగించిన పంజాబ్‌

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే నెల 3వ తేదీ వరకు కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది.

Update: 2020-04-29 17:03 GMT
Representational Image

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే నెల 3వ తేదీ వరకు కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. అయితే పంజాబ్‌లో మే 3వ తేదీ నుంచి మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ బుధవారం వెల్లడించారు.

ఈ మేరకు సీఎం వీడియో సందేశంలో మాట్లాడుతూ.. కర్ఫ్యూ నేపథ్యంలో ప్రతిరోజూ కేవలం నాలుగు గంటలపాటు మాత్రమే సడలింపు ఉంటుందని తెలిపారు. రోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచేందుకు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల విభాగం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లు, మాస్కులను కచ్చితంగా వాడాలని పేర్కొంది. 


Tags:    

Similar News