ముంబయిలో పున:ప్రారంభమైన లోకల్ ట్రయిన్స్.. అత్యవసర సేవలకే అనుమతి
కరోనా వ్యాప్తిలో ప్రధమ స్థానంలో ఉన్న మహారాష్ట్ర ముంబాయి నగరంలో నేటి నుంచి లోకల్ ట్రయిన్స్ పున: ప్రారంభమయ్యాయి.
కరోనా వ్యాప్తిలో ప్రధమ స్థానంలో ఉన్న మహారాష్ట్ర ముంబాయి నగరంలో నేటి నుంచి లోకల్ ట్రయిన్స్ పున: ప్రారంభమయ్యాయి. మూడు నెలల తరువాత వీటిని తిప్పేందుకు రైల్వేశాఖ అదికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే వీటిలో కేవలం అత్యవసర సేవలకు వెళ్లేవారికే అనుమతి ఇవ్వాలంటూ నిర్ణయం తీసుకున్నాయి.
లోకల్ రైలు ప్రయాణాలకు పెట్టింది పేరు ముంబయి. లాక్డౌన్తో గత రెండు నేలలుగా మూతపడిన లోకల్ ట్రైన్స్ సోమవారం నుంచి పున: ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం కొంతమందికి మాత్రమే అనుమతిని ఇస్తున్నట్లు ముంబయి లోకల్ ట్రైన్ అధికారులు పేర్కొన్నారు. అత్యవసర సేవల సిబ్బంది, వైద్య రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్న వారు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
లోకల్ రైళ్లను తీసుకొచ్చే అంశమై సమాశమైన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా అత్యవసర సేవల సిబ్బంది కూడా లోకల్ ట్రైన్స్లో ప్రయాణించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు అధికారులు. స్టేషన్లోకి వెళ్లేందుకు, టికెట్ కొనేటప్పుడు ఈ ఐడెంటిటీ కార్డుని చూపించవలసి ఉంటుంది. అనంతరం ఈ పాస్ లేదా క్యూ ఆర్ వస్తుంది. దీని ఆధారంగా రైల్వే స్టేషన్కి అనుమతిస్తారు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఒక లోకల్ ట్రైన్లో కేవలం 700 మంది పాసింజర్స్కి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.